Sakshi News home page

చంద్రబాబు.. సోషల్‌ మీడియాలో వైరల్‌

Published Thu, Jun 29 2017 9:14 AM

అర్థం పర్థం లేని ప్రకటనలు చేయడం, సాధ్యాసాధ్యాలను గమనించకుండా నోటికొచ్చినట్లు మాట్లాడడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు కొత్తేమీ కాదు. ఒలింపిక్‌ క్రీడల్లో విజయం సాధిస్తే ప్రపంచ ప్రఖ్యాత నోబెల్‌ బహుమతి ఇస్తానంటూ చంద్రబాబు బుధవారం చేసిన ప్రకటన సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారింది. గతంలో చంద్రబాబు చేసిన ప్రకటనలపై కూడా విపరీతమైన చర్చ జరిగింది. నెటిజన్లు వ్యంగ్యాస్త్రాలు విసిరారు.