Sakshi News home page

వెయ్యేళ్ల విగ్రహం తునాతునకలు

Published Sun, Jan 29 2017 8:30 AM

ఛత్తీస్ గఢ్‌ లో మావోయిస్టులు మరోసారి పంజా విసిరారు. దంతెవాడ జిల్లాలోని ధోల్ కాల్ కొండపై ఉన్న అత్యంత పురాతన వినాయకుడి విగ్రహాన్ని ధ్వంసం చేశారు. 1000 ఏళ్ల చరిత్ర కలిగిన ప్రతిమను తునాతునకలు చేశారు. ఇది మావోయిస్టుల పనే పోలీసులు పేర్కొన్నారు. వినాయకుడిని దర్శించుకునేందుకు పెద్ద సంఖ్యలో భక్తులు, యాత్రికులు ఇక్కడకు వస్తుండడంతో తమ ఉనికికి భంగం కలుగుతుందనే ఉద్దేశంతో మావోయిస్టులు ఈ ఘాతుకానికి పాల్పడివుంటారని పోలీసులు అంటున్నారు.

Advertisement
Advertisement