క్రిస్మస్‌ వేడుకలకు మెదక్‌ చర్చి ముస్తాబు | Sakshi
Sakshi News home page

క్రిస్మస్‌ వేడుకలకు మెదక్‌ చర్చి ముస్తాబు

Published Sun, Dec 25 2016 7:25 AM

ఆసియాలోనే అతిపెద్దదైన మెదక్‌ సీఎస్‌ఐ చర్చి క్రిస్మస్‌ వేడుకలకు సిద్ధమైంది. కరుణామయుని నిలయంలో ప్రార్థన చేసేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తున్నారు. వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు సీఎస్‌ఐ మెదక్‌ డయాసిస్‌ అన్ని ఏర్పాట్లు చేస్తోంది. ఆదివారం నుంచి ప్రారంభమయ్యే ఈ వేడుకలు జనవరి 2 వరకు కొనసాగనున్నాయి. వేకువజామున 4.30 గంటలకు బిషప్‌ ఏసీ సాల్మన్‌ రాజు మొదటి ప్రార్థనలతో చర్చిలో వేడుకలను ప్రారంభిస్తారు.