అటు కూంబింగ్.. ఇటు విచారణ | Sakshi
Sakshi News home page

అటు కూంబింగ్.. ఇటు విచారణ

Published Thu, Jan 7 2016 7:01 AM

ముష్కర మూకలు దాడి చేసిన పంజాబ్‌లోని పఠాన్‌కోట్ ఎయిర్‌బేస్‌లో కూబింగ్ ఆపరేషన్ ముమ్మరంగా కొనసాగుతోంది. నాలుగు రోజులుగా తుపాకుల మోతతో హోరెత్తిన ఈ ప్రాంతంలో ఇంకా ఉగ్రవాదులు మిగిలున్నారా అనే అనుమానంతో భద్రతా దళాలు అణువణువూ గాలిస్తున్నాయి. మరోవైపు ఈ ఘటనను విచారించేందుకు ఎన్‌ఐఏ చీఫ్ శరద్‌కుమార్ రంగంలోకి దిగారు బుధవారం ఎయిర్‌బేస్‌లో వాస్తవ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. పఠాన్‌కోట్ ఘటనకు సంబంధించి.. ఇప్పటివరకు మొత్తం మూడు కేసులను ఎన్‌ఐఏ నమోదు చేసింది.

Advertisement
Advertisement