మాజీమంత్రి, ప్రస్తుత పీసీసీ అధికార ప్రతినిధి కోటగిరి విద్యాధరరావు గుండెపోటుతో మరణించారు. ఏలూరులోని తన నివాసంలో ఈరోజు ఉదయం ఆయన కన్నుమూశారు. పంచాయతీ ఎన్నికల్లో తన కుమార్తెకు మద్దతుగా ప్రచారం చేసేందుకు వెళుతు విద్యాధరరావు కారు ఎక్కుతూ గుండెపోటుకు గురయ్యారు. ఆయన కొంతకాలం అనారోగ్యంతో బాధపడ్డారు. కోటగిరి మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. 1983లో విద్యాధరరావు తొలిసారి శాసనసభ్యుడిగా ఎన్నికయ్యారు. ఎన్టీఆర్ హయాంలో వ్యవసాయ శాఖ, చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో భారీ పరిశ్రమల శాఖ మంత్రిగా పనిచేశారు. 2008లో చిరంజీవి స్థాపించిన ప్రజారాజ్యం పార్టీ తీర్థం తీసుకున్నారు. పీఆర్పీ విలీనం అనంతరం చిరంజీవి వెంటే కాంగ్రెస్ పార్టీలో చేరారు. 1983 నుంచి వరుసగా ఐదు సార్లు ఎమ్మెల్యేగా చింతలపూడి నియోజకవర్గం నుంచి ఎన్నికైన కోటిగిరికి జిల్లాలో మంచి పట్టున్న నేతగా పేరుంది. ఆయన ఆకస్మిక మృతితో ఏలూరులో విషాద ఛాయలు అలుముకున్నారు. విద్యాధరరావు మృతి పట్ల అన్ని రాజకీయ పార్టీల నేతలు సంతాపం తెలిపారు. కాగా కోటగిరి మరణవార్త విన్న కేంద్ర పర్యాటక శాఖ మంత్రి చిరంజీవి హుటాహుటీన ఢిల్లీ నుంచి ఏలూరు బయల్దేరారు.
కోటగిరి విద్యాధరరావు గుండెపోటుతో మృతి
Published Sat, Jul 20 2013 10:50 AM
Advertisement
తప్పక చదవండి
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హిట్ సినిమా చైల్డ్ ఆర్టిస్ట్
- పూంఛ్ ఉగ్రదాడి.. బీజేపీ ఎన్నికల స్టంట్: చన్నీ
- 'టైటానిక్', 'లార్డ్ ఆఫ్ ది రింగ్స్' నటుడు కన్నుమూత
- అయోధ్య వెళ్లటంపై వివక్ష!: కాంగ్రెస్కు రాధికా ఖేరా రాజీనామా
- కేరళ: హాస్టల్ బాత్రూమ్లో బిడ్డకు జన్మనిచ్చిన యువతి
- లైంగిక వేధింపుల కేసు: ప్రజ్వల్ రేవణ్ణపై బ్లూకార్నర్ నోటీసులు
- మీనాక్షి ఇంత క్యూట్ గా ఉందేంటి? సీరత్ ఏకంగా అలా!
- AP: డీజీపీని బదిలీ చేసిన ఎన్నికల కమిషన్
- IPL 2024: సీఎస్కేకు బిగ్ షాక్.. స్వదేశానికి వెళ్లిపోయిన స్టార్ బౌలర్
- IPL 2024: పంజాబ్తో మ్యాచ్.. సీఎస్కే జట్టులో ఓ మార్పు
Advertisement