రూ. 100 కోట్లతో అపార్ట్‌మెంట్ కొనుగోలు! | Sakshi
Sakshi News home page

రూ. 100 కోట్లతో అపార్ట్‌మెంట్ కొనుగోలు!

Published Tue, Aug 23 2016 5:46 PM

ఒకవైపు ముంబై మహానగరంలో నివాస గృహాల మార్కెట్ బాగా పతనావస్థలో ఉండగా.. కాంగ్రెస్ నాయకుడి కుమారుడు ఒకరు ఏకంగా వంద కోట్ల రూపాయలతో ఓ అపార్టుమెంట్ కొన్నారు. బిహార్ మాజీ గవర్నర్ డీవై పాటిల్ కుమారుడు అజింక్య పాటిల్.. వర్లి సమీపంలోని సిల్వరిన్ టెర్రస్ ప్రాంతంలో ఓ ట్రిప్లెక్స్ అపార్టుమెంటును కొన్నారు. సముద్రానికి ఎదురుగా ఉండే ఈ 23 అంతస్తుల భవనం గురించి ముంబైలో తెలియనివాళ్లు అంటూ దాదాపుగా ఉండరు. ఈ డీల్ మార్కెట్లో పెను మార్పులకు దారితీస్తుందని రియల్ ఎస్టేట్ వర్గాలు అంటున్నాయి.