విలువలతో పోరాడే దమ్ము, ధైర్యం కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలకు లేదని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల అన్నారు. వైఎస్ఆర్ జిల్లా మైదుకూరులో జరిగిన సమైక్య శంఖారావం బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా ఈ రోజు ఆమె ఇక్కడకు వచ్చారు. ఆ రెండు పార్టీలు కుట్రలు, కుతంత్రాలతో జగనన్నను జైలులో పెట్టించారన్నారు. జగనన్న జైలులో ఉన్నా పులేన్నారు. వెన్నుపోటుదారు చంద్రబాబును తరిమి..తరిమి కొట్టాలని షర్మిల పిలుపు ఇచ్చారు. తన కొడుకు కోసం ఎన్టీఆర్ కుటుంబ సభ్యులను చంద్రబాబు తొక్కిపెట్టారని విమర్శించారు. హైదరాబాద్ తన వల్లే అభివృద్ధి చెందినట్లు గొప్పలు చెబుతున్న చంద్రబాబు హైదరాబాద్కు ఏం చేశారని ప్రశ్నించారు. హైదరాబాద్ చుట్టు ఉన్న విలువైన భూములను తన వారికి అమ్ముకున్నారన్నారు. చార్మినార్ను మీరే కట్టారా అని ఆమె చంద్రబాబును ప్రశ్నించారు. హైదరాబాద్ గురించి మాట్లాడే హక్కు చంద్రబాబుకు లేదన్నారు. ఇప్పటికైనా తెలంగాణపై చంద్రబాబు ఇచ్చిన లేఖను వెనక్కు తీసుకోవాలన్నారు. కాంగ్రెస్ పార్టీని ఉద్దేశించి న్యాయం చేసే సత్తా మీకు లేదు..ఇక రాష్ట్రాన్ని సమైక్యంగానే ఉంచండి అని అన్నారు. న్యాయం జరిగేంత వరకు ప్రజలతో కలిసి పోరాడుతామని చెప్పారు.
దమ్ము, ధైర్యంలేని కాంగ్రెస్,టిడిపి
Published Sat, Sep 7 2013 1:24 PM
Advertisement
తప్పక చదవండి
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- బీజేపీలో చేరిన ఢిల్లీ మాజీ కాంగ్రెస్ చీఫ్ అరవిందర్ సింగ్
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement