ఎమ్ సెట్ మే 8కి మార్పు! | Sakshi
Sakshi News home page

ఎమ్ సెట్ మే 8కి మార్పు!

Published Mon, Mar 2 2015 8:07 PM

ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పరీక్ష నిర్వహణ తేదీ మారింది. మే 8న ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం ఏపీలో మే 10 వ తేదీన ఎంసెట్ పరీక్ష నిర్వహించాల్సివుంది. కాగా డీఎస్సీ, కేసెట్ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో పరీక్ష తేదీని మార్చినట్టు గంటా శ్రీనివాసరావు చెప్పారు. కాకినాడ జేఎన్టీయూకు నిర్వహణ బాధ్యత అప్పగించనున్నట్టు తెలిపారు. కాగా మిగిలిన సెట్ల తేదీలలో మార్పు ఉండబోదని మంత్రి చెప్పారు. మే 16 ఐసెట్, 28న ఎడ్సెట్, 30న లాసెట్ పరీక్షలు జరగనున్నాయి.

Advertisement

తప్పక చదవండి

Advertisement