ఆంధ్రప్రదేశ్లో ఎంసెట్ పరీక్ష నిర్వహణ తేదీ మారింది. మే 8న ఈ పరీక్ష నిర్వహించనున్నట్టు ఏపీ విద్యా శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రకటించారు. మంగళవారం నోటిఫికేషన్ విడుదల చేయనున్నట్టు తెలిపారు. ఇంతకుముందు షెడ్యూల్ ప్రకారం ఏపీలో మే 10 వ తేదీన ఎంసెట్ పరీక్ష నిర్వహించాల్సివుంది. కాగా డీఎస్సీ, కేసెట్ పరీక్షల తేదీలను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులు ఇబ్బంది పడకూడదనే ఉద్దేశ్యంతో పరీక్ష తేదీని మార్చినట్టు గంటా శ్రీనివాసరావు చెప్పారు. కాకినాడ జేఎన్టీయూకు నిర్వహణ బాధ్యత అప్పగించనున్నట్టు తెలిపారు. కాగా మిగిలిన సెట్ల తేదీలలో మార్పు ఉండబోదని మంత్రి చెప్పారు. మే 16 ఐసెట్, 28న ఎడ్సెట్, 30న లాసెట్ పరీక్షలు జరగనున్నాయి.
ఎమ్ సెట్ మే 8కి మార్పు!
Published Mon, Mar 2 2015 8:07 PM
Advertisement
తప్పక చదవండి
- వరల్డ్కప్కు వెస్టిండీస్ జట్టు ప్రకటన.. విధ్వంసకర ఆటగాళ్లకు ఛాన్స్
- గుర్తుపట్టలేనంతగా మారిపోయిన టాలీవుడ్ స్టార్ హీరోయిన్
- ICC: నంబర్ వన్గా ఆసీస్.. అందులో మాత్రం టీమిండియానే టాప్
- కోర్టు పెండింగ్లో ఉన్న కేసు గురించి ఎలా మాట్లాడతారు?
- మద్యం పాలసీ కేసు.. మనీష్ సిసోడియాకు ఊరట
- ‘రాహుల్, లాలూ యాదవ్ పేరుందని పోటీ చేయకుండా ఆపలేం’
- ఎక్కువ జీతం కోసం ఎదురు చూస్తున్నారా? అయితే ఇది మీకోసమే
- గేల్, డివిలియర్స్ కాదు.. అతడంటే నాకు వణుకు: గంభీర్
- 'సలార్' పరిస్థితి మరీ ఇంత దారుణమా.. కారణం అదేనా?
- Kushitha Kallapu: ఆరెంజ్ ఆర్మీ విన్తో ‘ఖుషీ’ అవుతున్న ఈ గ్లామర్ లుక్స్ ఎవరివి? (ఫోటోలు)
Advertisement