Sakshi News home page

‘కృష్ణా’పై ఐదుగురు సభ్యుల కమిటీ

Published Wed, Dec 21 2016 8:47 AM

కృష్ణా నదీ జలాల వివాదాల పరిష్కారానికి వీలుగా కేంద్ర ప్రభుత్వం మరో ముందడుగు వేసింది. కృష్ణా జలాల నిర్వహణ ఎలా ఉండాలో తేల్చేందుకు ఐదుగురు సభ్యులతో కమిటీని నియమిం చింది. కేంద్ర జల సంఘం(సీడబ్ల్యూసీ) మాజీ చైర్మన్ ఏకే బజాజ్‌ చైర్మన్ గా సీడబ్ల్యూసీ మాజీ సభ్యుడు ఎం.గోపాలకృష్ణన్, రూర్కీ సైంటిస్ట్‌ డాక్టర్‌ ఆర్‌పీ పాండే, చీఫ్‌ ఇంజనీర్‌ ప్రదీప్‌ కుమార్‌ శుక్లా, సీడబ్ల్యూసీ హైడ్రాలజీ డైరెక్టర్‌ ఎన్ఎన్ రాయ్‌ సభ్యులుగా ఈ కమిటీని ఏర్పాటు చేస్తూ మంగళవారం కేంద్ర జల వనరుల శాఖ సెక్రటరీ మనోజ్‌ శర్వర్‌ ఉత్తర్వులు జారీ చేశారు.

Advertisement
Advertisement