మళ్లీ పసిడి పరుగులు | Sakshi
Sakshi News home page

మళ్లీ పసిడి పరుగులు

Published Tue, Sep 20 2016 7:15 AM

దేశీయ బులియన్ మార్కెట్లో పెరిగిన పసిడి కొనుగోలు, అంతర్జాతీయ సంకేతాలతో బంగారం ధరలకు మళ్లీ రెక్కలొచ్చాయి. సోమవారం 10 గ్రాముల బంగారం ధర 110 రూపాయలు ఎగిసి, రూ.31,150ల వద్ద నమోదైంది. గతవారంలో కొంత తగ్గుముఖం పట్టిన ఈ ధరలు మళ్లీ పెరగడం గమనార్హం. వెండి సైతం రూ.45వేల మార్కును అధిగమించింది. 525 రూపాయలు ఎగిసి, కేజీ సిల్వర్ ధర రూ.45,500గా రికార్డైంది.

Advertisement

తప్పక చదవండి

Advertisement