చైనాకు చెక్ పెట్టేందుకు..! | Sakshi
Sakshi News home page

చైనాకు చెక్ పెట్టేందుకు..!

Published Sat, Sep 3 2016 3:20 PM

శత్రువుకి శత్రువు మనకు మిత్రుడు అన్న సూత్రాన్ని ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనుసరిస్తున్నట్లు ఆయన వియత్నాం పర్యటనను గమనిస్తే అర్థమౌతోంది. చైనా దూకుడుకు కళ్లెం వేసే దిశగా ప్రధాని మోదీ హనోయ్ పర్యటన కొనసాగుతోంది. వియత్నాంకు భారీ ఎత్తున రక్షణ సహకారం, నిధులను అందించేందుకు మోదీ అంగీకరించారు. దీంతో ఆగ్నేయ ఆసియాలో భారత ప్రమేయాన్ని పెంపొందించే దిశగా ప్రయత్నాలు సాగిస్తున్నారు.