దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు తహసీన్ అరెస్ట్ | Sakshi
Sakshi News home page

దిల్సుఖ్నగర్ పేలుళ్ల నిందితుడు తహసీన్ అరెస్ట్

Published Tue, Mar 25 2014 1:28 PM

దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితుడు, ఇండియన్‌ ముజాహిద్దీన్‌ నేత తహసీన్‌ అక్తర్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. అతను ఇచ్చిన సమాచారంతోనే రెండు రోజుల క్రితం జోధ్‌పూర్‌లో వఖాస్‌ను అరెస్ట్‌ చేసిన విషయం తెలిసిందే. అయితే ఢిల్లీ పోలీసులు అక్తర్‌ అరెస్ట్‌ను ఆలస్యంగా ప్రకటించారు. మొత్తంమీద దిల్‌సుఖ్‌నగర్‌ కేసులో ఇప్పటిదాకా రియాజ్‌ మినహా మిగతా వారంతా అరెస్ట్‌ అయ్యారు. యాసిన్‌ భత్కల్‌ అరెస్ట్ అనంతరం తహసీన్ కమాండర్ బాధ్యతలు చేపట్టాడు.

Advertisement

తప్పక చదవండి

Advertisement