'చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలి' | Sakshi
Sakshi News home page

'చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలి'

Published Sun, Aug 11 2013 4:14 PM

సీమాంధ్ర ప్రాంత టీడీపీ నేతలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటే తక్షణమే చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ ఆ పార్టీ నేతలను ఆదివారం విజయవాడలో డిమాండ్ చేశారు. ఆ తర్వాతే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని సీమాంధ్ర టీడీపీ నేతలకు ఆయన సూచించారు. చంద్రబాబు సమైక్యాంధ్రకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న తర్వాతే సీమాంధ్ర ప్రాంతంలో అడుగుపెట్టాలని జోగి రమేష్ సూచించారు. అప్పటి వరకు సీమాంధ్ర ప్రాంతంలో అడుగుపెట్టే అర్హత చంద్రబాబుకు లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్వవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని జోగి రమేష్ తెలిపారు. దిగ్విజయ్ వ్యాఖ్యలను రమేష్ ఈ సందర్భంగా ఖండించారు.

Advertisement
Advertisement