సీమాంధ్ర ప్రాంత టీడీపీ నేతలు సమైక్య రాష్ట్రాన్ని కోరుకుంటే తక్షణమే చంద్రబాబు నాయుడుతో రాజీనామా చేయించాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత జోగి రమేష్ ఆ పార్టీ నేతలను ఆదివారం విజయవాడలో డిమాండ్ చేశారు. ఆ తర్వాతే సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని సీమాంధ్ర టీడీపీ నేతలకు ఆయన సూచించారు. చంద్రబాబు సమైక్యాంధ్రకు అనుగుణంగా నిర్ణయం తీసుకున్న తర్వాతే సీమాంధ్ర ప్రాంతంలో అడుగుపెట్టాలని జోగి రమేష్ సూచించారు. అప్పటి వరకు సీమాంధ్ర ప్రాంతంలో అడుగుపెట్టే అర్హత చంద్రబాబుకు లేదని ఆయన స్పష్టం చేశారు. అయితే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిపై ఆంధ్రప్రదేశ్ వ్యవహారాల పర్వవేక్షకుడు దిగ్విజయ్ సింగ్ చేసిన ఆరోపణలు నిరాధారమైనవని జోగి రమేష్ తెలిపారు. దిగ్విజయ్ వ్యాఖ్యలను రమేష్ ఈ సందర్భంగా ఖండించారు.
'చంద్రబాబు తక్షణమే రాజీనామా చేయాలి'
Published Sun, Aug 11 2013 4:14 PM
Advertisement
తప్పక చదవండి
- అమిత్ షా డీప్ఫేక్ వీడియో.. తెలంగాణ నుంచే వైరల్
- Nyrika Holkar: గోద్రెజ్ సైనిక... నైరిక
- వైఎస్సార్సీపీ దూకుడు
- గ్యారంటీ, ష్యూరిటీల పేరుతో వ్యక్తిగత లబ్ధి ప్రచారానికి బ్రేక్
- కరెంటు కోతల్లేవ్ నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేస్తున్నాం
- పట్టభద్రుల ఎమ్మెల్సీ బీఆర్ఎస్ అభ్యర్థిగా ఏనుగుల రాకేశ్రెడ్డి
- రగులుతున్న క్యాంపస్లు!
- దశ దిశ మార్చే విజన్ అంటే ఇదే కదా!
- రేవంత్ ప్రచారం చేయకుండా నిషేధించాలి
- కేకేఆర్ చేతిలో ముంబై ఓటమి.. ప్లే ఆఫ్స్ నుంచి ఔట్?
Advertisement