భారీగా మిర్చి విత్తనాలు స్వాధీనం | Sakshi
Sakshi News home page

భారీగా మిర్చి విత్తనాలు స్వాధీనం

Published Sun, Nov 27 2016 7:44 AM

ఖమ్మం జిల్లా కొణిజెర్ల మండలంలో విజిలెన్స్ అధికారులు భారీగా మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. పల్లిపాడులోని స్వర్ణభారతి కోల్డ్ స్టోరేజిపై శనివారం మధ్యాహ్నం విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. ఈ సందర్భంగా గోదాములో అక్రమంగా నిల్వ ఉంచిన సుమారు 1.40 లక్షల బస్తాల మిర్చి విత్తనాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు నిల్వలను సీజ్ చేసి, నిర్వాహకులను ప్రశ్నిస్తున్నారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement