ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి? | Sakshi
Sakshi News home page

ఎమ్మెల్యేలు ఇంకా రారేంటి?

Published Mon, Feb 13 2017 7:13 AM

న్నై నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: శశికళ శిబిరం నుంచి 11 మంది ఎంపీలతోపాటు అన్నాడీఎంకే నేతలు తన శిబిరంలోకి వచ్చినా, ఆశించిన సంఖ్యలో ఎమ్మెల్యేలు రాకపోవడం పట్ల తమిళనాడు ఆపద్ధర్మ ముఖ్యమంత్రి పన్నీర్‌ సెల్వం ఆలోచనలో పడ్డారు. ఆదివారం నాటికి కనీసం 25 మంది శాసనసభ్యులు తన గూటికి చేరుతారని ఆయన భావించారు. అయితే, మంత్రి పాండియరాజన్‌ మాత్రమే వచ్చి చేరారు. దీంతో శశికళ శిబిరంలోని ఎమ్మెల్యేలకు ఎలా వల వేయాలనే దానిపై పన్నీర్‌సెల్వం వర్గం కసరత్తు చేస్తోంది.

Advertisement
Advertisement