ఏటీఎంలో డబ్బు డ్రా చేసి.. దొరికేశాడు! | Sakshi
Sakshi News home page

ఏటీఎంలో డబ్బు డ్రా చేసి.. దొరికేశాడు!

Published Wed, Oct 12 2016 11:34 AM

గోవాకు చెందిన పెర్ఫ్యూమ్ స్పెషలిస్టు మోనికా ఘర్డే హత్యకేసులో నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆమె డెబిట్ కార్డు దొంగిలించిన నిందితుడు.. దాంతో బెంగళూరులో డబ్బులు డ్రా చేయడంతో దొరికిపోయాడు. మోనికా ఇంతకుముందు ఉండే అపార్టుమెంటు ప్రాంగణంలో సెక్యూరిటీ గార్డుగా పనిచేసిన వ్యక్తే ఈ ఘాతుకానికి పాల్పడినట్లు తేలింది. మోనికాను హత్య చేసినట్లు అతడు అంగీకరించాడని పోలీసులు అంటున్నారు. అతడు ఆమెను ఎందుకు చంపాడన్నది స్పష్టంగా తెలియకపోయినా, ఈ హత్యకేసులో ఇంకెవరూ లేరని.. అతడొక్కడే ఈ ఘాతుకానికి పాల్పడాడని ఒక నిర్ధారణకు వచ్చారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement