‘ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించింది’ | Sakshi
Sakshi News home page

‘ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించింది’

Published Fri, Sep 23 2016 7:44 PM

ఆంధ్రప్రదేశ్ శాసనసభ ప్రివిలేజ్ కమిటీకి శుక్రవారమిక్కడ సమావేశమైంది. అసెంబ్లీ వర్షకాల సమావేశాల్లో జరిగిన పరిణామాలపై చర్చ జరిగింది. 45 రోజుల్లో స్పీకర్కు నివేదిక ఇవ్వాలని సభా హక్కుల కమిటీ నిర్ణయించింది. ఈ భేటీ ముగిసిన అనంతరం వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. తమ పార్టీ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం కుట్ర పన్నిందన్నారు. అందులో భాగంగానే యనమల తీర్మానం ప్రవేశపెట్టారని, వర్షాకాల సమావేశాల్లో ప్రభుత్వం రెచ్చగొట్టేలా వ్యవహరించిందన్నారు.

Advertisement
Advertisement