క్యాంటీన్లో మోదీ భోజనం.. బిల్లు రూ. 29 | Sakshi
Sakshi News home page

క్యాంటీన్లో మోదీ భోజనం.. బిల్లు రూ. 29

Published Mon, Mar 2 2015 6:33 PM

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పార్లమెంట్ క్యాంటీన్లో సందడి చేశారు. పార్లమెంట్ భవనంలో 70వ నెంబర్ గదిలోని క్యాంటీన్కు సోమవారం వచ్చారు. క్యాంటీన్లో మోదీ ఎంపీలతో కలసి భోజనం చేశారు. మోదీ భోజనం చేయడానికి పార్లమెంట్ క్యాంటీన్కు రావడంతో అక్కడున్న ఎంపీలు ఆశ్చర్యపోయారు. మోదీ ఎంపీలతో సరదాగా ముచ్చటిస్తూ భోజనం చేశారు. మోదీ శాఖహారం తీసుకుని, దాని బిల్లు 29 రూపాయలు చెల్లించారు. అనంతరం మోదీ క్యాంటీన్లోని రిజిస్టర్లో అన్నదాత ధన్యవాదాలంటూ రాశారు.

Advertisement
Advertisement