చిత్తూరులో దొంగల బీభత్సం | Sakshi
Sakshi News home page

చిత్తూరులో దొంగల బీభత్సం

Published Mon, Jul 13 2015 10:14 AM

దోపిడీ దొంగలు బీభత్సం సృష్టించారు. చిత్తూరు జిల్లా మదనపల్లె మండలం చీకలబైలు పెట్రోల్ బంకుపై దొంగలు సోమవారం తెల్లవారుజామున దాడి చేశారు. ఈ దాడిలో రూ.50 వేల నగదు, ఒక వాహనంతో ఉడాయించారు. అడ్డు వచ్చిన సిబ్బందిపై దాడి చేసి ముగ్గురిని గాయపరిచారు. సిబ్బందిని వైద్యం కోసం ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement