ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచే నేరుగా నగదు | Sakshi
Sakshi News home page

ప్రింటింగ్‌ ప్రెస్‌ నుంచే నేరుగా నగదు

Published Thu, Dec 15 2016 9:21 AM

భారీ ఎత్తున నగదు, బంగారంతో పట్టుబడిన టీటీడీ పాలకమండలి సభ్యుడు శేఖర్‌రెడ్డికి ప్రింటింగ్‌ ప్రెస్‌ ద్వారానే కొత్త కరెన్సీ అందినట్లు తెలిసింది. ఇందుకు పది మంది అధికారులు ఆయనకు సహకరించినట్లు సమాచారం. శేఖర్‌రెడ్డి, కిరణ్‌రెడ్డి, ప్రేమ్‌రెడ్డి, శ్రీనివాసరెడ్డి ఇళ్లపై ఇటీవల ఐటీ అధికారులు మెరుపుదాడులు నిర్వహించి రూ.161 కోట్ల నగదు, 179 కిలోల బంగారు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న నగదులో రూ.2వేల నోట్లు రూ.34 కోట్లు కొత్త కరెన్సీ అని అధికారిక సమాచారం కాగా రూ.70 కోట్లుగా అనధికారిక సమాచారం.

Advertisement
Advertisement