హీటర్ ఎక్కువసేపు పెట్టానని కొట్టిండు! | Sakshi
Sakshi News home page

హీటర్ ఎక్కువసేపు పెట్టానని కొట్టిండు!

Published Tue, Sep 13 2016 9:36 AM

‘మళ్లీ బావ కొట్టిండు. నేను ఏమీ అనలేదు. హీటర్ కాసేపు ఎక్కువ పెట్టినని కొట్టిండు. అప్పటికీ చూసుకోలేదు తప్పైంది అన్నా. అయినా బాత్రూమ్‌లో స్నానం చేస్తుంటే వచ్చి కొట్టిండు. బయటకు వచ్చినాక బట్టలు కూడ వేసుకోలే... వాళ్ల అమ్మ ఉంది కింద. తోటి కోడలు వాళ్ల పిల్లలు చూస్తుండగానే బట్టలు లేకుంటా కొట్టాడు. మా మామయ్య పైకి వచ్చి ఆయన్నే సపోర్ట్ చేస్తుండు’... హైదరాబాద్‌లోని సైదాబాద్ ఠాణా పరిధిలో ఆదివారం అనుమానాస్పద స్థితిలో మరణించిన సుశ్రీత తాను చనిపోవడానికి కొద్దిసేపటి ముందు తల్లిదండ్రులకు పంపిన వాట్సప్ మెస్సేజ్ ఇది. ఆమె భర్తతో పాటు అత్తమామల్నీ పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. సైదాబాద్ డివిజన్ పూసలబస్తీకి చెందిన ఎస్.మోహన్ రాజ్ జీవీకే సంస్థలో సైంటిస్ట్. ఈయనకు పదేళ్ల క్రితం నల్లగొండ జిల్లా సూర్యాపేటకు చెందిన సుశ్రీతతో(30) వివాహమైంది. వీరికి ఇద్దరు కుమారులు. వివాహమైన నాటి నుంచి దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఇటీవల మరింత పెరిగాయి.

Advertisement
Advertisement