తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: సోనియా | Sakshi
Sakshi News home page

తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి: సోనియా

Published Wed, Apr 16 2014 5:14 PM

తెలంగాణ అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెడతామని కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీ అన్నారు. కరీంనగర్లో కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన బహిరంగ సభలో సోనియా ప్రసంగించారు. సోనియా ప్రసంగం ఆమె మాటల్లోనే... 'పోరాటం అయిపోయింది. ఇక పాలన చేయాల్సిన సమయం వచ్చింది. ఈ పని కేవలం కాంగ్రెస్ మాత్రమే చేయగలదు. టీఆర్ఎస్ కేవలం అవతలివాళ్లను దూషించడానికే పరిమితం అయిపోతోంది తప్ప వాళ్లకు పాలనానుభవం లేదు. అందువల్ల మీ అందరికీ నేను చేసేది ఒకటే విజ్ఞప్తి. మీరు సీమాంధ్ర ప్రజలందరితో సోదర భావంతో ఉండాలి తప్ప.. కొట్లాటలు కూడదు. మీ అందరూ ఒక్కొక్క ఓటు కాంగ్రెస్ పార్టీకే వేయండి. ఆ ఓట్లే తెలంగాణ బంగారు భవిష్యత్తును నిర్దేశిస్తాయి.

Advertisement
Advertisement