భత్కల్‌ సహా ఆ ఐదుగుర్ని వెంటనే ఉరితీయాలి | Sakshi
Sakshi News home page

భత్కల్‌ సహా ఆ ఐదుగుర్ని వెంటనే ఉరితీయాలి

Published Mon, Dec 19 2016 6:33 PM

దిల్‌సుఖ్‌నగర్‌ జంటపేలుళ్ల కేసులో ప్రధాన సూత్రధారులైన ఐదుగురు ఉగ్రవాదులకు ఎన్‌ఐఏ ప్రత్యేక కోర్టు ఉరిశిక్ష విధించడంపై మృతుల కుటుంబసభ్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 18మంది అమాయకుల ప్రాణాల్ని పొట్టనబెట్టుకున్న ముష్కరుల్ని వెంటనే ఉరితీయాలని, వారికి హైకోర్టులో, సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకునే అవకాశం ఇవ్వకూడదని వారు కోరుతున్నారు. 2013 ఫిబ్రవరి 21న దిల్‌సుఖ్‌నగర్‌ బాంబు పేలుళ్లతో దద్దరిల్లిన సంగతి తెలిసిందే. యావత్‌ హైదరాబాద్‌ను దిగ్భ్రాంతపరిచిన ఈ ఘటనలో 18 మంది ప్రాణాలు కోల్పోయారు. 140మందికి గాయాలయ్యాయి.

Advertisement
Advertisement