టీడీపీ ఆఫీసును స్వాధీనం చేసుకున్న టీఎంసీ | Sakshi
Sakshi News home page

టీడీపీ ఆఫీసును స్వాధీనం చేసుకున్న టీఎంసీ

Published Tue, Aug 12 2014 3:46 PM

పార్లమెంట్లో టీడీపీ కార్యాలయం విషయంలో వివాదం ఏర్పడింది. టీడీపీ ఆఫీసును తృణమాల్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు స్వాధీనం చేసుకున్నారు. కార్యాలయం ముందు తృణమాల్ కాంగ్రెస్ పార్లమెంటరీ పార్టీ బోర్డు కూడా ఏర్పాటు చేశారు. తమకు 40 మంది ఎంపీలున్నారని, టీడీపీకి కేవలం 22 మంది ఎంపీలే ఉన్నందున తమకే ఆ ఆఫీసు ఉపయోగించుకునే అర్హత ఉందని తృణమాల్ ఎంపీలు చెప్పారు. అయితే 30 ఏళ్లుగా తమ పార్టీ ఇదే కార్యాలయాన్ని వాడుకుంటున్నందున తమకే దక్కాలని టీడీపీ ఎంపీలు వాదిస్తున్నారు.