విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతి | Sakshi
Sakshi News home page

విద్యుత్ షాక్తో ఇద్దరు యువకులు మృతి

Published Thu, Nov 7 2013 12:57 PM

ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఈ రోజు తెల్లవారుజామున మహబూబ్నగర్ పట్టణంలో చోటు చేసుకుంది. మహబూబ్నగర్లోని హౌసింగ్ బోర్డ్ కాలనీలోని యూబీ గార్డెన్ ఫంక్షన్హాల్లో విద్యుత్ మరమతులు నిర్వహిస్తున్నారు. అందులోభాగంగా ఇనుప నుచ్చెనపై నిల్చుని ఇద్దరు యువకులు మరమతులు నిర్వహిస్తున్నారు. ప్రమాదవశాత్తు ఆ ఇనుప నుచ్చెన హైటెన్షన్ వైర్లకు తగిలింది. దాంతో ఆ యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతుల కుటుంబాలకు రూ.10 లక్షల నష్ట పరిహారం చెల్లించాలని సీఐటీయూ ఆధ్వరంలో యూబీ ఫంక్షన్ హాల్ ఎదుట ధర్నా నిర్వహించారు.

Advertisement
Advertisement