Sakshi News home page

16న యూపీ–బీజేపీ శాసనసభాపక్షం భేటీ!

Published Wed, Mar 15 2017 2:38 PM

ఉత్తరప్రదేశ్‌ రాష్ట్ర బీజేపీ శాసనసభాపక్ష సమావేశం మార్చి 16న జరిగే వీలుంది. రాష్ట్రానికి సీఎంని నియమించే పనిలో బీజేపీ నాయకత్వం బిజీగా ఉంది. రాష్ట్రానికి బీజేపీ కేంద్ర పరిశీలకులుగా కేంద్రమంత్రి వెంకయ్య, పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్‌లు నియమితులయ్యారు. 16న జరిగే సమావేశంలో వెంకయ్య, యాదవ్‌లు పాల్గొని, ఎమ్మెల్యేలను సంప్రదించి, సీఎం అభ్యర్థుల పేర్లను అమిత్‌ షాకు నివేదిస్తారు.

Advertisement

తప్పక చదవండి

Advertisement