భువనేశ్వర్ విజృంభణ | Sakshi
Sakshi News home page

భువనేశ్వర్ విజృంభణ

Published Sun, Sep 3 2017 7:26 PM

శ్రీలంకతో ద్వైపాక్షిక సిరీస్ లో భాగంగా చివరిదైన ఐదో వన్డేలో భారత పేసర్ భువనేశ్వర్ కుమార్ విజృంభించాడు. తన పదునైన బంతులతో చెలరేగి పోయిన భువీ ఐదు వికెట్లతో లంక పతనాన్ని శాసించాడు. భువనేశ్వర్ దెబ్బకు లంక 49.4 ఓవర్లలో 238 పరుగులకు కుప్పకూలింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లంకను ఆదిలోనే రెండు వికెట్లు తీసి చావుదెబ్బ కొట్టిన భువీ.. చివరి ఓవర్లలో సైతం చెలరేగి మరో మూడు వికెట్లను సాధించాడు. దాంతో వన్డేల్లో ఐదు వికెట్లను తొలిసారి ఖాతాలో వేసుకున్నాడు. అతనికి జతగా బూమ్రా రెండు వికెట్లతో మెరవడంతో లంక సాధారణ స్కోరుకే పరిమితమైంది. స్పిన్నర్లు కుల్దీప్, చాహల్ కు తలో వికెట్ దక్కింది.

Advertisement
Advertisement