కెరీర్లో తొలి గ్రాండ్స్లామ్ మహిళల డబుల్స్ టైటిల్ నెగ్గాలని ఆశించిన భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా అనుకున్నది సాధించింది. మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్)తో కలిసి ప్రతిష్టాత్మక వింబుల్డన్ డబుల్స్ టైటిల్ను సొంతం చేసుకుంది. శనివారం జరిగిన డబుల్స్ ఫైనల్లో టాప్ సీడ్ సానియా-మార్టినా హింగిస్ (స్విట్జర్లాండ్) జంట 5-7, 7-6 (7/4), 7-5తో రెండో సీడ్ ఎకతెరీనా మకరోవా-ఎలీనా వెస్నినా (రష్యా) ద్వయంపై గెలిచి చాంపియన్గా నిలిచింది. విజేత సానియా జంటకు 3 లక్షల 40 వేల పౌండ్లు (రూ. 3 కోట్ల 34 లక్షలు), రన్నరప్ మకరోవా-వెస్నినా జోడీకి లక్షా 70 వేల పౌండ్లు (రూ. కోటీ 67 లక్షలు) ప్రైజ్మనీగా లభించాయి. 2003లో అలీసా క్లెబనోవా (రష్యా)తో కలిసి వింబుల్డన్ జూనియర్ బాలికల డబుల్స్ విభాగంలో విజేతగా నిలిచిన సానియా 12 ఏళ్ల తర్వాత హింగిస్తో కలిసి మహిళల డబుల్స్ టైటిల్ను నెగ్గడం విశేషం. గతంలో సానియా నెగ్గిన మూడు గ్రాండ్స్లామ్ టైటిల్స్ మిక్స్డ్ డబుల్స్ విభాగంలో వచ్చాయి. భారత్కే చెందిన మహేశ్ భూపతితో కలిసి ఆస్ట్రేలియన్ ఓపెన్ (2009), ఫ్రెంచ్ ఓపెన్ (2012), బ్రూనో సోరెస్ (బ్రెజిల్)తో కలిసి 2014లో యూఎస్ ఓపెన్ సాధించింది.
వారెవ్వా... సానియా
Published Sun, Jul 12 2015 6:49 AM
Advertisement
తప్పక చదవండి
- ఏబీసీ పార్టీలది ముస్లిం లీగ్ ఎజెండా: జేపీ నడ్డా
- డీజీపీగా హరీష్కుమార్ గుప్తా
- ‘సిద్ధం’ పాటల సీడీని ఆవిష్కరించిన భారతమ్మ
- అలా చేస్తే ఆ కిక్కే వేరు! అతడితో లవ్లో ఉన్నా: నటి
- హీట్వేవ్ నుంచి ఉపశమనం.. త్వరలో వర్షాలు: వాతావరణ శాఖ
- డైరెక్టర్తో హీరోయిన్ పెళ్లి.. మామయ్యను మండపానికి రానివ్వలేదట!
- మాచర్లలో సీఎం జగన్ ప్రచారం.. పోటెత్తిన ప్రజాభిమానం (ఫొటోలు)
- కాంగ్రెస్ కీలక నిర్ణయం: బరిలోకి మాజీ ముఖ్యమంత్రులు
- హార్దిక్ కాదు!.. రోహిత్ తర్వాత టీమిండియా కెప్టెన్ అతడే!
- చంద్రబాబు మోసాల చరిత్రను గుర్తు తెచ్చుకోండి: సీఎం జగన్
Advertisement