కంటైనర్‌,టెంపో ఢీ : ఐదుగురు మృతి | Sakshi
Sakshi News home page

కంటైనర్‌,టెంపో ఢీ : ఐదుగురు మృతి

Published Sat, Aug 5 2017 11:13 AM

చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మదనపల్లి శివారులోని ఈడిగపల్లి ఏతాలవంక వద‍్ద శనివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో డ్రైవర్‌ సహా నలుగురు స్పెయిన్‌ దేశీయులు దుర‍్మరణం చెందారు. మృతులు స్పెయిన్‌ దేశానికి చెందినవారు. ట్రావెల్‌ టెంపోలో అనంతపురం జిల్లా పుట‍్టపర్తి నుంచి చిత్తూరువైపు వెళుతుండగా ఎదురుగా వేగంగా వచ్చిన కంటైనర్‌ లారీ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటన స‍్థలంలో నలుగురు మృతిచెందగా ఆస‍్పత్రికి తరలిస్తుండగా మరొకరు మృతి చెందారు

Advertisement

తప్పక చదవండి

Advertisement