మాజీ మంత్రి ముఖేశ్గౌడ్ కుమారుడు విక్రమ్గౌడ్పై జరిగిన కాల్పుల కేసు కొలిక్కి వస్తోంది. ఈ వ్యవహరం వెనుక అనంతపురానికి చెందిన ముఠా ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. సోమవారం రాత్రి నాటికి అనంతపురం జిల్లాలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్న ప్రత్యేక బృందాలు ప్రధాన సూత్రధారి కోసం గాలిస్తున్నాయి. అతడు ప్రస్తుతం కర్ణాటకలో తలదాచుకున్నట్లు తెలుసుకున్న పోలీసులు ఓ ప్రత్యేక బృందాన్ని అక్కడకు పంపారు. సూత్రధారి చిక్కితేనే ఈ కేసులో చిక్కుముడులు వీడే అవకాశం ఉందని ఓ ఉన్నతాధికారి ‘సాక్షి’తో చెప్పారు. శనివారం విక్రమ్గౌడ్ ఇచ్చిన వాంగ్మూలం, ఆయన ఇంటి సమీపంలోని సీసీ కెమెరాలో లభించిన ద్విచక్ర వాహనం ఆనవాళ్లు తదితరాలను పరిగణనలోకి తీసుకున్న పోలీసులు దీని వెనుక మరికొందరు ఉన్నారని భావించారు. ఈ కోణంలో దర్యాప్తు చేసిన ప్రత్యేక బృందాలు సోమవారం అనంతపురంలో ఇద్దరు నిందితుల్ని అదుపులోకి తీసుకున్నాయి.
కాల్పుల వెనుక ‘అనంత’ ముఠా!
Published Tue, Aug 1 2017 6:51 AM
Advertisement
తప్పక చదవండి
- సీఎం రేవంత్పై ’ఈసీ‘కి బీఆర్ఎస్ ఫిర్యాదు
- రిజర్వేషన్లను రద్దు చేయాలన్నదే ఆర్ఆర్ఎస్ మూల సిద్ధాంతం: రేవంత్
- హీరో నవీన్ చంద్రకు ప్రతిష్టాత్మక పురస్కారం
- నా కుమారుడు వరల్డ్కప్ జట్టుకు ఎంపికవుతాడని స్వీట్లు, టపాసులు తెచ్చా: రింకూ తండ్రి ఆవేదన
- సుల్తాన్పూర్ లోక్సభ స్థానానికి మేనకా గాంధీ నామినేషన్ దాఖలు
- ‘దిశ’ ఎన్కౌంటర్ కేసు.. సిర్పూర్ కర్ కమిషన్ రిపోర్ట్పై స్టే
- జనసేన నేతలకు అవమానం.. టీడీపీ ప్రచార రథంపై నుంచి గెంటేసి..
- ప్రపంచంలోనే అత్యంత ధనిక ఖైదీ..!
- రాయ్బరేలీ, అమేథి స్థానాలపై 24 గంటల్లో తుది నిర్ణయం
- సీఐ, ఎస్ఐ వేధిస్తున్నారు.. సూసైడ్ లేఖ రాసి..
Advertisement