ఇది ఏ ఇజం? | Sakshi
Sakshi News home page

ఇది ఏ ఇజం?

Published Fri, Jan 17 2020 8:20 AM

భారతీయ జనతా పార్టీ(బీజేపీ) భావజాలం, తమ పార్టీ భావజాలం ఒక్కటేనని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఉద్ఘాటించారు. 2014 ఎన్నికల తరువాత బీజేపీతో ఏర్పడిన కమ్యూనికేషన్‌ గ్యాప్‌ ఇప్పుడు తొలగిపోయిందని చెప్పారు. ప్రత్యేక ప్యాకేజీ గురించి బీజేపీ నేతలు వివరిస్తుంటే దానివల్ల ఎంత ఉపయోగమో తెలిసిందని పేర్కొన్నారు. ఇకనుంచి ఎలాంటి షరతులూ లేకుండా బీజేపీతో కలసి పని చేస్తామని తేల్చిచెప్పారు. మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా గతంలో ప్రత్యేక ప్యాకేజీకి ఒప్పుకున్నారని పవన్‌ గుర్తు చేశారు.