వేగంగా వచ్చి హోటల్‌లోకి దూసుకెళ్లింది | Sakshi
Sakshi News home page

వేగంగా వచ్చి హోటల్‌లోకి దూసుకెళ్లింది

Published Tue, May 1 2018 11:02 AM

డ్రైవర్‌ నిర్లక్ష్యం, అతివేగం పలువురిని ఘోర రోడ్డు ప్రమాదాలకు గురిచేస్తోంది. తాజాగా పుణేలో ఓ విషాద సంఘటన చోటు చేసుకుంది. ఓ వాహన డ్రైవర్‌ తన ఎస్‌యూవీని వేగంగా నడపడంతో, అది అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న హోటల్‌లోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఓం ప్రకాశ్‌ పండిన్‌వార్‌(60) అనే వ్యక్తి అక్కడిక్కడే మరణించాడు. డ్రైవర్‌తో పాటు మరో ఇద్దరు గాయాలు పాలయ్యారు. సోమవారం మధ్యాహ్నం 1 గంటకి సంఘ్వీ చౌక్‌లో ఈ ప్రమాదం జరిగింది.

Advertisement
Advertisement