పీఎన్‌బీ స్కాంలో మరో కీలక అరెస్ట్‌ | Sakshi
Sakshi News home page

పీఎన్‌బీ స్కాంలో మరో కీలక అరెస్ట్‌

Published Wed, Feb 21 2018 11:25 AM

పీఎన్‌బీ స్కాంలో  వేగాన్ని పెంచిన సీబీఐ తాజాగా  మరోకీలక అరెస్ట్‌ చేసింది.  రూ.11,400 కోట్ల పీఎన్‌బీ కుంభకోణానికి సంబంధించి  పంజాబ్ నేషనల్ బ్యాంకు  జనరల్ మేనేజర్ ర్యాంక్ అధికారి రాజేష్ జిందాల్‌ను మంగళవారం  రాత్రి  సీబీఐ అరెస్ట్‌ చేసింది.  2009 ఆగస్ట్‌, మే 2011 మధ్య  ముంబై బ్రాండీ హౌస్‌ బ్రాంచ్‌ హెడ్‌గా  రాజేష్‌ పనిచేశారు. ప్రస్తుతం  రాజేష్‌ ఢిల్లీ బ్రాంచ్‌లో జనరల్‌ మేనేజర్‌గా ఉన్నారు.  ఈయన పదవీకాలంలోనే నీరవ్‌ మోదీ కంపెనీకి ఎల్‌ఓయూల జారీ  ప్రక్రియ ప్రారంభమైనట్టుగా  సీబీఐ భావిస్తోంది. ఇప్పటికే బ్యాంకుకు చెందిన పలువురు కీలక అధికారులు, ఇతర కీలక ఉద్యోగులను ప్రశ్నించిన అనంతరం సీబీఐ అరెస్ట్‌ చేసింది

Advertisement
Advertisement