గడిచిన నాలుగేళ్లలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి పరిపాలన కాలంలో ఏ ఒక్క రైతు ముఖంలో సంతోషం లేకుండా పోయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. నాలుగేళ్లుగా అక్కాచెల్లెమ్మలను, రైతులను, యువకులను, నిరుద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారని ధ్వజమెత్తారు. తన పాదయాత్ర సాగుతున్న అడుగడుగునా రైతులు తమ సమస్యల గోడును చెప్పుకుంటున్నారని, వారి సమస్యలు మరింత లోతుగా తెలుసుకునేందుకు రైతులతో ఆత్మీయ సమ్మేళన కార్యక్రమం కొనసాగిస్తున్నట్లు చెప్పారు. 93వ రోజు ప్రజాసంకల్పయాత్రలో భాగంగా ప్రకాశం జిల్లా కొండెపి నియోజకవర్గం, తిమ్మపాలెంలో జరిగిన రైతుల ఆత్మీయ సమ్మేళనంలో వైఎస్ జగన్ మాట్లాడారు.
రైతులకు ఉచితంగా బోర్లు
Published Tue, Feb 20 2018 5:13 PM
Advertisement
తప్పక చదవండి
Advertisement