హిమాచల్‌లో విరిగిపడ్డ కొండచరియలు | Sakshi
Sakshi News home page

హిమాచల్‌లో విరిగిపడ్డ కొండచరియలు

Published Sun, Sep 3 2017 7:37 AM

భారీ వర్షాలకు కొండ చరియలు విరిగిపడటంతో హిమాచల్‌ప్రదేశ్‌లోని ధల్లీ ప్రాంతంలో 8 వాహనాలు శిథిలాల్లో కూరుకుపోయినట్లు సిమ్లా డిప్యూటీ కమిషనర్‌ రోహన్‌ చంద్‌ ఠాకూర్‌ తెలిపారు. ధల్లీ– షోగీ రహదారిపై కొండ చరియలు కుప్పకూలడంతో భారీ సంఖ్యలో ట్రక్కులు నిలిచిపోయాయన్నారు. ప్రమాదం లో మూడు ఇళ్లు, ఓ గుడి దెబ్బతిన్నట్లు తెలిపారు. రాష్ట్రంలోని నహన్, పొంటా సాహెబ్‌ పట్టణాల్లో సరా సరి 137 మి.మీ, నైనాదేవీలో 118 మి.మీ. వర్షపాతం నమోదైందన్నారు.