వైఎస్‌ జగన్‌‌ను కలిసిన బాక్సింగ్‌ క్రీడాకారిణి బగ్గు మౌనిక | Sakshi
Sakshi News home page

వైఎస్‌ జగన్‌‌ను కలిసిన బాక్సింగ్‌ క్రీడాకారిణి బగ్గు మౌనిక

Published Sun, Sep 16 2018 5:58 PM

ప్రజల సమస్యలు తెలుసుకోవటానికి జననేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన పాదయాత్ర విశాఖపట్నం జిల్లాలో విజయవంతంగా కొనసాగుతోంది. ఆదివారం 263వ రోజు ప్రజాసంకల్పయాత్ర పెందుర్తి నియోజకవర్గంలోని పెందుర్తి జంక్షన్‌ నుంచి ప్రారంభమైంది. అభిమాన నాయకున్ని కలవటానికి, సమస్యలు విన్నవించుకోవటానికి జనం తండోపతండాలుగా తరలివస్తున్నారు. దీనిలో భాగంగా బాక్సింగ్‌ క్రీడాకారిణి బగ్గు మౌనిక జననేతను కలిశారు. ఈ క్రమంలోనే ఆమె మాట్లాడుతూ.. విజయాలు సాధించినపుడు ప్రభుత్వం సన్మానాలు చేస్తోందని.. అంతకంటే ముందు ఎలాంటి ప్రోత్సాహం అందించటం లేదని మండిపడ్డారు. తనకు స్పాన్సర్‌ షిప్‌ కావాలని జననేతను ఆమె కోరారు. 

Advertisement
Advertisement