ఐటీగ్రిడ్స్‌ సంస్థను సీజ్‌ చేసిన సిట్‌ అధికారులు | Sakshi
Sakshi News home page

ఐటీగ్రిడ్స్‌ సంస్థను సీజ్‌ చేసిన సిట్‌ అధికారులు

Published Fri, Mar 8 2019 7:29 PM

ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోన్న ఐటీగ్రిడ్స్‌ స్కాంపై తెలంగాణ ప్రభుత్వం నియమించిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్‌) దర్యాప్తును వేగవంతం చేసింది. దానిలో భాగంగానే హైదరాబాద్‌లోని మాదాపూర్‌ అయ్యప్ప సోసైటీలో ఉన్న ఐటీగ్రిడ్స్‌ సంస్థను సిట్‌ అధికారులు సీజ్‌ చేశారు. విచారణ కోసం తమ అదుపులోకి తీసుకుంటున్నట్లు సిట్‌ ప్రకటించింది. ఏపీ ప్రజలు డేటాచోరీ కేసులో గత రెండు రోజులు ఐటీగ్రిడ్స్‌ సంస్థలో సిట్‌ సోదాలు చేస్తోన్న విషయం తెలిసిందే.

Advertisement

తప్పక చదవండి

Advertisement