కిడ్నాపర్లను పట్టుకుంటేనే పనిపూర్తి : సీఎం జగన్‌ | Sakshi
Sakshi News home page

కిడ్నాపర్లను పట్టుకుంటేనే పనిపూర్తి : సీఎం జగన్‌

Published Fri, Jul 26 2019 8:14 AM

రాష్ట్రవ్యాప్తంగా కలకలం రేపిన నాలుగేళ్ల చిన్నారి జసిత్‌ కిడ్నాప్‌ కథ సుఖాంతం అయింది. నాలుగు రోజుల ఉత్కంఠకు తెరదించుతూ.. కుతుకులూరు చింతాలమ్మ గుడివద్ద బాలున్ని కిడ్నాపర్లు గురువారం తెల్లవారుజామున వదిలి వెళ్లారు. ఈ కేసును ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఎస్పీ అద్నాన్‌ నయీం అస్మీ చొరవ వల్లే తమ పిల్లాడు క్షేమంగా ఇల్లు చేరాడని కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. జసిత్‌ క్షేమంగా ఇల్లు చేరడంపై ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ హర్షం వ్యక్తం చేశారు. కేసు వివరాలను డీజీపీ గౌతమ్‌ సవాంగ్‌ సీఎంకు వివరించడంతో ఆయన ఎస్పీకి ఫోన్‌ చేశారు.