ఉద్రిక్తంగా ర్యాలీ | Sakshi
Sakshi News home page

ఉద్రిక్తంగా ర్యాలీ

Published Tue, Nov 19 2019 8:10 AM

హాస్టల్‌ ఫీజుల పెంపునకు నిరసనగా జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ (జేఎన్‌యూ) విద్యార్థులు సోమవారం చేపట్టిన పార్లమెంట్‌ మార్చ్‌ ఉద్రిక్తతలకు దారి తీసింది. ఫీజుల పెంపును నిరసిస్తూ వర్సిటీ నుంచి పార్లమెంట్‌ వైపు ర్యాలీగా బయలుదేరిన విద్యార్థులను పోలీసులు ఎక్కడికక్కడ అడ్డుకున్నారు. స్టూడెంట్స్‌ యూనియన్‌ అధ్యక్షుడు ఆయిషీ ఘోష్‌ సహా దాదాపు 100 మంది విద్యార్థులను అదుపులోకి తీసుకున్నారు. పలువురిపై లాఠీ చార్జ్‌ చేశారు. పోలీసుల దాడిలో పలువురు విద్యార్థులకు గాయాలయ్యాయి.

Advertisement
Advertisement