ప్రేమోన్మాది దాడి : చికిత్స పొందుతూ రవళి మృతి | Sakshi
Sakshi News home page

ప్రేమోన్మాది దాడి : చికిత్స పొందుతూ రవళి మృతి

Published Mon, Mar 4 2019 7:41 PM

ప్రేమోన్మాది పెట్రోల్‌ దాడిలో తీవ్రంగా గాయపడిన డిగ్రీ విద్యార్థిని రవళి మృతి చెందింది. సికింద్రాబాద్‌లోని యశోద ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఆమె ఈ సోమవారం సాయంత్రం కన్నుమూసింది. గత కొద్దిరోజులుగా వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమంగా ఉంటూ వచ్చింది. పెట్రోల్‌ మంటల్లో శ్వాసనాళాలు పూర్తిగా కాలిపోవటంతో ఊపిరితీసుకోవటం కూడా ఇబ్బందిగా మారింది. దీంతో వెంటిలేషన్ సహాయంతో డాక్టర్లు కృత్తిమ శ్వాస అందించారు. అయినప్పటికి వారి ప్రయత్నాలు ఫలించలేదు.