బీసీలందరూ కలిసి చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి | Sakshi
Sakshi News home page

బీసీలందరూ కలిసి చంద్రబాబుకు బుద్ధి చెప్పాలి

Published Mon, Nov 13 2017 3:40 PM

రాష్ట్రంలో అరాచకపాలనకు చరమగీతం పాడాలని 3 వేల కిలోమీటర్ల ప్రజాసంకల్పయాత్ర చేపట్టిన వైఎస్‌ఆర్‌ సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ధన్యవాదాలు చెబుతున్నట్లు నెల్లూరు ఎమ్మెల్యే అనిల్‌కుమార్‌ యాదవ్‌ తెలిపారు. ప్రజాసంకల్పయాత్ర 7వ రోజులో భాగంగా వైఎస్‌ఆర్‌ కడప జిల్లాలోని కానగూడురులో బహిరంగ సభలో అనిల్‌ కుమార్‌ మాట్లాడారు. స్వతంత్ర భారతంలో బీసీలకు అండగా ఉన్న నాయకులు కేవలం ఎన్‌టీఆర్‌, వైఎస్‌ఆర్‌లేనని అన్నారు.