టీఆర్‌ఎస్‌కు విశ్వేశ్వర్‌ రెడ్డి గుడ్‌బై | Sakshi
Sakshi News home page

టీఆర్‌ఎస్‌కు విశ్వేశ్వర్‌ రెడ్డి గుడ్‌బై

Published Tue, Nov 20 2018 7:54 PM

 ఎన్నికల ప్రచారంలో తలమునకలై ఉన్న టీఆర్‌ఎస్‌కు భారీ షాక్‌ తగిలింది. చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌ రెడ్డి పార్టీకి గుడ్‌బై చెప్పారు. కొన్నాళ్లుగా పార్టీలో జరుగుతున్న పరిణామాలతో అసంతృప్తితో ఉన్న ఆయన పార్టీ సభ్యత్వంతో పాటు, ఎంపీ పదవికి కూడా రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ క్రమంలో తెలంగాణ భవన్‌కు రాజీనామా లేఖను పంపారు. అంతేకాదు ఈనెల 23న సోనియా గాంధీ సమక్షంలో కాంగ్రెస్‌ తీర్థం పుచ్చుకోనున్నట్లు తెలుస్తోంది.

Advertisement
Advertisement