వ్యవసాయ రంగంలో ప్రైవేటుగా పెట్టుబడులు పెడతామని, అందుకు అవకాశమివ్వాలని రిలయన్స్ గ్రూప్ అధినేత ముఖేష్ అంబానీ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు. వెలగపూడి సచివాలయంలోని రియల్ టైమ్ గవర్నెన్స్(ఆర్టీజీ) సెంటర్లో మంగళవారం ముఖ్యమంత్రి చంద్రబాబు, రాష్ట్ర ప్రభుత్వ అధికారులతో ఆయన సమావేశమై పలు అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖేష్ మాట్లాడుతూ వ్యవసాయం, విద్య, వైద్య రంగాలు దేశానికి పెద్ద సవాలు వంటివని, వాటిలో ప్రైవేటు పెట్టుబడులకు అవకాశాలివ్వాలన్నారు. వ్యవసాయ రంగంలో తమ కంపెనీ పెట్టుబడులు పెడుతుందని, తద్వారా ఎంతోమందికి ఉపాధి కల్పించవచ్చని తెలిపారు. ప్రస్తుతం దేశంలోని ఓపెన్ సోర్స్ సాఫ్ట్వేర్ రంగాన్ని అభివృద్ధి చేయడం వల్ల యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.
వ్యవసాయ రంగంలో పెట్టుబడులు పెడతాం
Published Wed, Feb 14 2018 8:24 AM
Advertisement
తప్పక చదవండి
- నాన్స్టాప్గా...
- ఐపీఎల్పై వివాదాస్పద కామెంట్స్.. క్లారిటీ ఇచ్చిన స్టార్ డైరెక్టర్
- ట్రెండింగ్లో 'హీరామండి'.. సిరీస్పై అద్భుతమైన ప్రశంసలు
- పూంచ్లో ఉగ్రదాడి.. సైనికులకు గాయాలు
- ఐసీయూలో అమ్మ... కలుస్తానంటే వెళ్లనివ్వలేదు: ప్రముఖ టీవీ నటి
- రాకాసి నర్సుకు 760 ఏళ్ల జైలు శిక్ష : అసలు ఏమైందంటే..!
- రాయ్బరేలి బరిలో రాహుల్.. వయనాడ్ ఓటర్ల ఫీలింగ్ ఇదే..!
- బాలుడి ఊపిరితిత్తుల్లోకి ఎల్ఈడీ బల్బు.. డాక్టర్లు ఏం చేశారంటే..
- చంద్రబాబు మేనిఫెస్టో మాయలు గుర్తున్నాయా?: సీఎం జగన్
- Tech Layoffs 2024: షాకింగ్ రిపోర్ట్: ఒక్క నెలలోనే 21 వేల టెకీలకు ఉద్వాసన
Advertisement