మూడు రోజుల నరకయాతన..తల్లి ఉద్వేగం | Sakshi
Sakshi News home page

మూడు రోజుల నరకయాతన..తల్లి ఉద్వేగం

Published Thu, Jul 25 2019 12:36 PM

కన్నకొడుకు కానరాక ఆ తల్లి పడిన వేదన వర్ణనాతీతం. నాలుగేళ్ల జసిత్‌ బుడిబుడి అడుగులు లేక ఆ ఇల్లు చిన్నబోయింది. మూడు రోజులుగా కిడ్నాపర్ల చెరలో ఉన్న చిట్టి తండ్రి ఎలా కంటబడతాడో అని క్షణమొక యుగంగా గడిచింది. అయితే, ఆ తల్లి మొర ఏ దేవుడో ఆలకించాడు. ఓవైపు పోలీసుల ముమ్మర గాలింపు చర్యలు, మరోవైపు సామాజిక మాధ్యమాలు, టీవీల్లో జసిత్‌ కిడ్నాప్‌ ఉదంతంపై విసృత ప్రచారం నేపథ్యంలో కిడ్నాపర్లు దిగొచ్చారు. పిల్లాడు తమవద్దే ఉంటే ఇక దొరికిపోవడం ఖాయమనుకున్నారు. గురువారం ఉదయం అనపర్తి మండలం కుతుకులూరు అమ్మవారి గుడివద్ద వదిలివెళ్లారు.