అత్యధికం నర్సంపేట.. అత్యల్పం యాకుత్‌పురా:ఈసీ | Sakshi
Sakshi News home page

అత్యధికం నర్సంపేట.. అత్యల్పం యాకుత్‌పురా:ఈసీ

Published Fri, Dec 7 2018 7:57 PM

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ ముగిసిన అనంతరం రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ రజత్‌ కుమార్‌ విలేకరులతో మాట్లాడుతూ.. ఈ సారి ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయని తెలిపారు. కొన్ని చోట్ల చెదురుమదురు ఘటనలు మినహా పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని వెల్లడించారు. ఎన్నికలకు సంబంధించి న్యూస్‌ కవరేజీ చేసినందుకు, ప్రశాంతంగా జరగడానికి దోహదపడినందుకు మీడియాకు కృతజ్ఞతలు తెలిపారు. 2014లో తెలంగాణాలో 69.5 శాతం ఓటింగ్‌ నమోదైందని, కానీ సాయంత్ర 5 గంటల వరకు అందిన రిపోర్టు ప్రకారం ఈ సారి 67 శాతం ఓటింగ్‌ జరిగినట్లు వివరించారు. మరో రెండు మూడు శాతం  పోలింగ్‌ ముగిసేనాటికి పెరగవచ్చునని వ్యాఖ్యానించారు.

Advertisement
Advertisement