జాతీయ గీతంలో ఆ పదం తొలగించాలని తీర్మానం | Sakshi
Sakshi News home page

జాతీయ గీతంలో ఆ పదం తొలగించాలని తీర్మానం

Published Sat, Mar 17 2018 9:02 AM

జాతీయ గీతంలో సింధ్‌ స్ధానంలో ఈశాన్యం అని చేర్చాలని ప్రతిపాదిస్తూ కాంగ్రెస్‌ ఎంపీ రిపున్‌ బోరా శుక్రవారం రాజ్యసభలో తీర్మానం ప్రవేశపెట్టారు. భారత్‌లో ఈశాన్యం కీలక ప్రాంతమని, అయినా ఆ ప్రాంతానికి జాతీయ గీతంలో చోటుదక్కకపోవడం దురదృష్టకరమన్నారు. మరోవైపు ప్రత్యర్థి పాకిస్తాన్‌ భూభాగంలో ఉన్న సింధ్‌ను జాతీయ గీతంలో ప్రస్తావిస్తున్నారని ఎగువ సభలో ప్రైవేట్‌ సభ్యుడి తీర్మానం ప్రవేశపెట్టిన అనంతరం ఎంపీ బోరా అన్నారు.