మిగిలిన రూ. 4.5 కోట్లకు ఎవరు హామీ ఇచ్చారు? | Sakshi
Sakshi News home page

మిగిలిన రూ. 4.5 కోట్లకు ఎవరు హామీ ఇచ్చారు?

Published Wed, Feb 20 2019 8:17 AM

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఓటుకు కోట్లు కేసులో ఈడీ దూకుడు పెంచింది. ఈ కేసులో ఏ–1 నిందితుడైన రేవంత్‌రెడ్డిని మంగళవారం 8 గంటలపాటు విచారించి ప్రశ్నలవర్షం కురిపించింది. ఉదయం 11.30కు ఈడీ కార్యాలయానికి హాజరైన రేవంత్‌ను రాత్రి 7.30 దాకా విచారించింది. ఈ వ్యవహారంలో హవాలా జరిగిందా అనే విషయాలపై అధికారులు ప్రశ్నలు సంధించినట్లు సమాచారం.