గుంటూరులో స్కూల్‌ బస్సు బోల్తా | Sakshi
Sakshi News home page

గుంటూరులో స్కూల్‌ బస్సు బోల్తా

Published Mon, Jan 28 2019 9:37 AM

ఓ పేరుపొందిన ప్రైవేట్‌ స్కూల్‌ బస్సు కల్వర్టుపై నుంచి బోల్తాపడింది. దీంతో బస్సులో ఉన్న విద్యార్ధులు హాహాకారాలు చేస్తూ ఆందోళనకు గురయ్యారు. ఈ ఘటన గుంటూరు జిల్లా వెల్దుర్తి మండలం మండాదిగోడు వద్ద చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులకు తీవ్ర గాయాలు కాగా, నలుగురి పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాద సమయంలో బస్సులో 60 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్ధుల తల్లిదండ్రులు స్కూల్‌ ఎదుట ఆందోళన చేస్తున్నారు. సంఘటనా స్థలానికి చేరుకున్న అధికారులు స్థానికుల సహాయంతో సహాయక చర్యలు చేపట్టారు. అయితే ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సివుంది.

Advertisement
Advertisement