టీడీపీకి శిల్పా మోహన్‌ రెడ్డి గుడ్‌ బై | Sakshi
Sakshi News home page

టీడీపీకి శిల్పా మోహన్‌ రెడ్డి గుడ్‌ బై

Published Mon, Jun 12 2017 7:30 PM

కర్నూలు జిల్లాలో తెలుగుదేశం పార్టీకి పెద్ద షాక్‌ తగిలింది. మాజీ మంత్రి,టీడీపీ సీనియర్ నేత శిల్పా మోహన్‌ రెడ్డి ఆ పార్టీకి గుడ్‌బై చెప్పారు. త్వరలో ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరనున్నారు. శిల్పా మోహన్‌ రెడ్డి సోమవారం తన అనుచరులతో భేటీ అయ్యారు. సమావేశం అనంతరం ఆయన మాట్లాడుతూ ఈనెల 14న ఆయన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి సమక్షంలో పార్టీలో చేరనున్నట్లు వెల్లడించారు.