నంద్యాల ఉప ఎన్నికల్లో కీలక పరిణామం | Sakshi
Sakshi News home page

నంద్యాల ఉప ఎన్నికల్లో కీలక పరిణామం

Published Mon, Jul 31 2017 3:56 PM

నంద్యాల ఉప ఎన్నికల నేపథ్యంలో వైఎస్ఆర్‌ కాంగ్రెస్ పార్టీలో కీలక పరిణామం చోటు చేసుకుంది. నంద్యాల ఉప ఎన్నికల్లో వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ తరుపున బరిలోకి దిగిన శిల్పా మోహన్‌రెడ్డి సోమవారం తన సోదరుడు, టీడీపీ ఎమ్మెల్సీ అయిన శిల్పా చక్రపాణి రెడ్డిని కలిశారు. ఉప ఎన్నికల నేపథ్యంలో ధర్మం ప్రకారం తనకు మద్దతు ఇవ్వాలని కోరారు. అన్నాదమ్ములం ఇద్దరం చెరో పార్టీలో ఉండాల్సిన అవసరం ఏముందని కూడా సోదరుడిని అడిగినట్లు తెలిసింది. అనంతరం శిల్పా మోహన్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ తాను వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీలో చేరిన తర్వాత తొలిసారి తన తమ్ముడు చక్రపాణిరెడ్డిని కలిసినట్లు తెలిపారు.

Advertisement
Advertisement